Sunday, May 4, 2014

మీ పిల్లలకు తెలుగు నేర్పించాలనుకుంటున్నారా..

రేపటి నుండి పాఠశాలకు వేసవి సెలవలు. మళ్ళీ సెప్టెంబర్  7 న కొత్త సంవత్సరం మొదలౌతుంది. ఆగస్టు 24 న విద్యార్దులందరూ ప్రవేశ పరీక్ష వ్రాయాలి. వారి మార్కులను బట్టి వారు ఏ తరగతిలో ఉండాలో ఉపాధ్యాయులు నిర్ణయిస్తారు. 

పాఠశాలలో విద్య పూర్తిగా ఉచితం. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. వార్షికోత్సవానికి, పిల్లలకు ఇచ్చే బహుమతులకు ఈ సంవత్సరం నలభై ఐదు డాలర్లు ఖర్చయింది. వచ్చే సంవత్సరం నుండి పుస్తకాలు ముద్రించడంకోసం అదనపు ఖర్చు ఉంటుంది. 

మీ ప్రాంతంలో పాఠశాల తరగతులు మొదలు పెట్టాలనుకున్నా, పాఠశాలో బోధించాలనుకున్నా, లేదా మీ పిల్లలను పాఠశాలలో చేర్పించాలనుకున్నా దయచేసి paatasalausa@gmail.com మెయిల్ చేయండి. పాఠాలు చెప్పడానికి కావలసిన పాఠ్య ప్రణాళికలు, పరిక్షా పత్రాలు అన్నీ అందజేయబడతాయి. ఉపాధ్యాయులు వారానికో గంట సమయం వెచ్చించగలిగితే చాలు.






1 comment:

  1. మాతృదేశాన్ని వదలినా మాతృభాషను మరువని మీకు మా ధన్యవాదములు.

    ReplyDelete